హైదరాబాద్.జంటనగరాల్లో బోనకనుస్తవాలకు 20 కోట్లు మంజూరు
అమరావతి, 25 జూన్ (హి.స.) హైదరాబాద్‌: జంటనగరాల్లో జరిగే బోనాల ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.20కోట్లు మంజూరు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. నగరంలోని 2,783 ఆలయాలకు వివిధ కార్యక్రమాలు నిర్వహణ కోసం నిధులను చెక్కుల రూపంలో జారీ చేసి
హైదరాబాద్.జంటనగరాల్లో బోనకనుస్తవాలకు 20 కోట్లు  మంజూరు


అమరావతి, 25 జూన్ (హి.స.)

హైదరాబాద్‌: జంటనగరాల్లో జరిగే బోనాల ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.20కోట్లు మంజూరు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. నగరంలోని 2,783 ఆలయాలకు వివిధ కార్యక్రమాలు నిర్వహణ కోసం నిధులను చెక్కుల రూపంలో జారీ చేసిందన్నారు. ఆషాఢ మాసంలో ముందుగా నగరంలోని గోల్కొండ బోనాలు జూన్‌ 29న జులై 1, 2 తేదీల్లో బల్కంపేట ఎల్లమ్మ బోనాలు, జులై 13, 14 తేదీల్లో శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానం బోనాలు, జులై 20న లాల్‌ దర్వాజా బోనాలు.. జులై 23న చార్మినార్‌ భాగ్యలక్ష్మి బోనాలు, మిగిలిన దేవాలయాల్లో ఈ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande