రైతు భరోసా పథకం ఎత్తేస్తారు.. మాజీ మంత్రి సంచలన కామెంట్స్..!
హైదరాబాద్, 25 జూన్ (హి.స.) తెలంగాణ భవన్ లో నేడు మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ లు ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలోని సమకాలీన పరిస్థితుల మధ్య మంత్రులు పలు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సమావేశంలో భాగంగా మాజీమంత్రి నిరంజన్
మాజీ మంత్రి


హైదరాబాద్, 25 జూన్ (హి.స.)

తెలంగాణ భవన్ లో నేడు మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ లు ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలోని సమకాలీన పరిస్థితుల మధ్య మంత్రులు పలు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సమావేశంలో భాగంగా మాజీమంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు సంబరాలు చేయడానికి ఈ ప్రభుత్వం కు అర్హత లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రాళ్లు, రప్పలకు రైతు బందు ఇచ్చారని తప్పు పట్టారన్నారు. అయితే ఇప్పుడు కూడా మేము ఇచ్చిన 70 లక్షల మంది రైతులకే మీరు కూడా రైతు భరోసా ఇచ్చారు కదా.. అంటే మీరు కూడా రాళ్లు, రప్పలకు, అనర్హులైన రైతులకే డబ్బులు ఇచ్చారా అని ప్రశ్నించారు.

అంతేకూండా, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హడావుడి చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు భరోసా పథకం ఎత్తివేయబోతుందని హాట్ కామెంట్స్ చేసారు. కేసీఆర్ లేఖ రాస్తే అసెంబ్లీలో చర్చ పెడతాం అనడం ఏంటి..? గతంలో కేసీఆర్ అసెంబ్లీలో అన్ని విషయాలు చెప్పారన్నారు. మీకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి.. మా వాళ్లు మాట్లాడుతారని, కేసీఆర్ ఎప్పుడు వచ్చి మాట్లాడాలో మీరు చెప్పడం ఏంటిని ఆయన అన్నారు. బనకచర్ల గురించి మాట్లాడమంటే, కాళేశ్వరం.. కూలేశ్వరం.. అంటున్నాడు ఈ సీఎం రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేసారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande