హైదరాబాద్, 25 జూన్ (హి.స.)
తెలంగాణ ఆషాఢ మాసం బోనాలు రేపటినుండి అట్టహాసంగా ప్రారంభం కాబోతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున వేడుకకు హాజరు కానున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చారిత్రాత్మక గోల్కొండ కోట జగదాంబికా మహంకాళి ఎల్లమ్మ ఆలయంలో ప్రారంభమయ్యే తెలంగాణ ఆషాఢ మాసం బోనాలు నెల రోజుల పాటు వైభవంగా కొనసాగనున్నాయి. ఈ సంబరాలకు జంట నగరాల నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించడానికి వస్తారు.
గోల్కొండ కోట వద్ద నీటి ట్యాంకర్లు, క్యూలైన్ల కోసం తాత్కాలిక బారికేడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఆలయానికి వెళ్లే దారిలో రోడ్లుకు మరమ్మతులు చేపడుతున్నారు. ఈ రోజు అమావాస్యం కావడంతో గోల్కొండలోని జగదాంబికా ఆలయ మార్గంలోని మెట్లకు బుధవారం.. పెద్ద ఎత్తున మహిళలు పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..