కోదాడ పోలీసులకు చిక్కిన అంతరాష్ట్ర కిడ్నీ రాకెట్ ముఠా..
తెలంగాణ, సూర్యాపేట. 25 జూన్ (హి.స.) సూర్యాపేట జిల్లాలోని కోదాడ పట్టణంలో అంతరాష్ట్ర కిడ్నీ రాకెట్ ముఠా పోలీసుల చేతికి చిక్కింది. ఈ విషయాన్ని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలక
కిడ్నీ రాకెట్


తెలంగాణ, సూర్యాపేట. 25 జూన్ (హి.స.) సూర్యాపేట జిల్లాలోని

కోదాడ పట్టణంలో అంతరాష్ట్ర కిడ్నీ రాకెట్ ముఠా పోలీసుల చేతికి చిక్కింది. ఈ విషయాన్ని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన పదిమంది కలిసి ఒక ముఠాగా ఏర్పడి, విజయవాడలోని కిడ్నీ డయాలసిస్ సెంటర్ల వద్ద కిడ్నీ వ్యాధిగ్రస్తులను లక్ష్యంగా చేసుకొని, కిడ్నీ మార్పిడి చేయిస్తామని నమ్మబలికే స్కామ్కు పాల్పడినట్లు తెలిపారు. చికిత్సకు అవసరమైన అనుమతులు, ధృవీకరణలు, రక్త నమూనాలు అన్నీ ఫోర్జరీ పత్రాలతో సిద్ధం చేసి, బాధితులను మరియు దాతలను ఏర్పాటుచేసి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటివరకు ఈ ముఠా ద్వారా దాదాపు పదిమందికి పైగా చట్టవిరుద్ధంగా కిడ్నీలు మార్పిడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande