సరుకు లేదు.. సబ్జెక్టు లేదు... అంతా బూతుపురాణాలే.. : కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
తెలంగాణ, జగిత్యాల. 25 జూన్ (హి.స.) సీఎం రేవంత్ రెడ్డి వద్ద సరుకు లేదు.. సబ్జెక్టు లేదు.. నోరు తెరిస్తే అంతా బూతు పురాణాలే అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా
కోరుట్ల ఎమ్మెల్యే


తెలంగాణ, జగిత్యాల. 25 జూన్ (హి.స.) సీఎం రేవంత్ రెడ్డి వద్ద సరుకు లేదు.. సబ్జెక్టు లేదు.. నోరు తెరిస్తే అంతా బూతు పురాణాలే అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు కోట్ల కోట్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ 11 పర్యాయాలు కరోనా కష్టకాలంలో కూడా రైతులకు రైతుబంధు ఇచ్చి ఆదుకున్న గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అంత చేసినా ఏ ఒక్కరోజు రూ.100 కోట్లు పెట్టి సంబరాలు చేయలేదన్నారు.

ఈ ముఖ్యమంత్రి సంబరాలు ఎందుకు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో 511 మంది రైతులను పొట్టన పెట్టుకున్నందుకా, ఇప్పటివరకు రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టినందుకా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు రైతులకు ఎకరాకు రూ.15000 ఇస్తానని చెప్పి రూ.12 వేలకు కుదించి నందుకా ఈ సంబరాలు అని ప్రశ్నించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande