హైదరాబాద్, 25 జూన్ (హి.స.)
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్
పార్టీ కట్టుబడి ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతుభరోసా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లుగా పదేళ్ల బీఆర్ఎస్ పాలన.. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని అన్నారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల నిర్వహణ న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ పార్టీ చర్చించి నిర్ణయం ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ 18 నెలల పాలన గోల్డెన్ పిరియడ్ అని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్