తెలంగాణ, ఆదిలాబాద్. 25 జూన్ (హి.స.)
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా
ఇన్చార్జి మార్పు తర్వాత మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రిగా మార్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన జిల్లాకు వచ్చేందుకు విముఖత వ్యక్తం చేశారు. గతంలో ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న సీతక్క ను నిజామాబాద్ జిల్లాకు మార్చారు. అయితే ఆమెను కొనసాగించాలని ఆదివాసి సంఘాలు సహా కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం అధిష్టానం పై ఒత్తిడి పెంచింది. దీంతో కొద్ది రోజులుగా డోలాయమానం కొనసాగింది.
దూరాభారం కారణంగా జూపల్లి కృష్ణారావు స్థానంలో అట్లూరి లక్ష్మణ్ కు అవకాశం ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇవేమీ పట్టించుకున్నట్లు కనిపించలేదు. ఎట్టకేలకు ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తొలిసారిగా ఆ హోదాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటన ఖరారయింది. గురు, శుక్రవారాల్లో ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, ఉట్నూరు, నిర్మల్ లలో ఆయన పర్యటించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు