తెలంగాణ, నల్గొండ. 25 జూన్ (హి.స.)
డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత యాంటీ డ్రగ్ సోల్జర్గా పని చేయాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా బుధవారం నల్లగొండ పట్టణంలో మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ కళాశాలల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. యువత తమ శక్తియుక్తులను మత్తు పదార్థాలకు అలవాటు పడి వృథా చేసుకోవద్దన్నారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. డ్రగ్స్ మీద పోలీసులు చేస్తున్న పోరాటంలో యువత పాలుపంచుకోవాలని కోరారు.
మత్తు పదార్థాల భారిన పడడం వల్ల యువత బంగారు భవిష్యత్ నాశనం అవుతోందన్నారు. శారీరక, మానసిక ఆరోగ్య విచ్ఛిన్నం కావడంతో పాటు, ఆర్థిక సమస్యలు, సమాజంలో గౌరవం లేకుండా పోతుందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు