తెలంగాణ, ఖమ్మం. 25 జూన్ (హి.స.)
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి
వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు ఏనుకూరు మండలంలో సుమారు 30 కోట్ల రూపాయల విలువ చేసి 600 ఇళ్లను లబ్ధిదారులు ఎంపిక చేసి ఇచ్చారని వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ అన్నారు. బుధవారం ఏనుకూరు రైతు వేదికలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా
రాందాస్ నాయక్ మాట్లాడుతూ పోతా పోతా కేసీఆర్ అప్పులు మిగిల్చి భారం మోపి ఫామ్ హౌస్ లో కూర్చున్నాడని, నెలకు 6000 కోట్ల రూపాయలు వడ్డీ కింద చెల్లిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం జరుగుతుందని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు