హైదరాబాద్, 25 జూన్ (హి.స.)
అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఆరు గ్యారెంటీల అమలు, మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసంపై చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబును పిలిచి హైదరాబాద్ బిర్యాని పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్ గా ఇచ్చారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి అబద్ధాలు ఆడడం అలవాటైందని 2016లో పోలవరం, బనకచర్ల అంశమే లేదన్నారు. మహిళలకు రూ. 2500, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీకి ఆబిడ్స్ జీపీవో నుంచి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత.. గోదావరి అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలని మాజీ సీఎం కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ పై స్పందించారు. '
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్