తెలంగాణ, జోగులాంబ గద్వాల. 25 జూన్ (హి.స.) జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండల పరిధిలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడం కలకలం రేపింది. ప్రతి అమావాస్యకు అక్కడ వెలసిన ఆంజనేయస్వామికి మొక్కులు తీర్చుకుంటారు ఇక్కడి భక్తులు. గుట్టు చప్పుడు కాకుండా గుప్త నిధుల కోసం గుడి అవరణలో తూర్పు వైపున నాలుగు అడుగుల మేరకు తవ్వకాలు చేసి గుడి గోడలను పెకిలించిన సంఘటన బుధవారం వెలుగు చూసింది. నేడు అమావాస్య సందర్భంగా పూజల కోసం వచ్చిన భక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మానోపాడు పోలీసులు సంఘటన స్థలంకు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు