హైదరాబాద్, 25 జూన్ (హి.స.)
ఓయో లాడ్జ్ లో ఓ యువతి
అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బ్యూటిషియన్ గా పనిచేస్తున్న నల్లగొండకు చెందిన అనూష (26) పెళ్లయిన కొద్ది రోజులకే భర్తతో విభేదాల కారణంగా విడిపోయి తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది. ఆన్లైన్లో ఎవరైనా ఆర్డర్ చేసినా వెళ్లి బ్యూటీషియన్ చేస్తుంది. ఇందులో భాగంగా ఈనెల 22వ తేదీన సాయంత్రం స్నేహితుల వద్దకు వెళ్తున్నానని చెప్పి అనూష ఇంట్లో నుంచి వెళ్లింది.
రాత్రి అయినా అనూష ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేశారు. అయినా అనూష ఎంతకూ స్పందించలేదు. అయితే ఓ యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి, గుల్షన్ కాలనీలోని క్యూబిన్ ఓయో లాడ్జిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఓయో లాడ్జి సిబ్బంది సోమవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రాయదుర్గం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్