వరంగల్, 25 జూన్ (హి.స.)
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం,
చింత నెక్కొండ రెవెన్యూ సమీపంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం మృతుడు చెన్నారావుపేట మండలం, ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ఆరేళ్లి శ్యామ్ సరిత దంపతుల కుమారుడు ఆరేళ్లి రోహిత్ (18) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడన్నారు. మృతుడు రోహిత్ ఇంటర్ పూర్తి చేసినట్లు తెలిపారు. సాయి రెడ్డి పల్లి నుండి నెక్కొండ వైపు ద్విచక్ర వాహనం పై వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. ఈ ప్రమాదంలో యువకుడి తలకు రాయి బలంగా తాకడంతో అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్