అమరావతి, 27 జూన్ (హి.స.)
విజయవాడ: నగరంలో ఏర్పాటు చేసిన టూరిజం కాన్క్లేవ్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి పర్యటక క్యారవాన్లు ప్రారంభించారు. టూరిజం రంగంలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
పర్యాటక ప్రాజెక్టులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక హోదా కల్పించింది. పర్యాటకాభివృద్ధి సంస్థ రూ.10,039 కోట్ల పెట్టుబడులపై ఒప్పందం కుదుర్చుకోనుంది. విశాఖ, అమరావతి, తిరుపతిలో హోటళ్ల నిర్మాణానికి ఒప్పందం జరగనుంది. కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేశ్, ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ