హైదరాబాద్, 27 జూన్ (హి.స.)
తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను అధికారులు శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 42,832 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 38,741 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల్లో 24,415 మంది (73.35 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..