తెలంగాణ,నాగర్ కర్నూల్. 27 జూన్ (హి.స.)
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట
మున్సిపల్ కేంద్రంలో గల వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. మహబూబ్నగర్ ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. వసతి గృహాలలో 18 రకాల రికార్డులను సంబంధిత వార్డెన్లు మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది.
అందుకు సంబంధించిన ప్రతి రికార్డులను క్షుణంగా పరిశీలన చేపట్టారు. ప్రధానంగా 2024- 25, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అన్ని విషయాలను కూలంకుషంగా అధికారులు పరిశీలన చేస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించారా వసతి గృహ పరిసరాల పరిశుభ్రత విద్యార్థుల సంఖ్య మెనూ పాటించారా రికార్డుల నమోదు ప్రక్రియ న్యాయబద్ధంగా ఉందా లేదా అనేక విషయాల పట్ల దాదాపు ఐదారు శాఖలకు సంబంధించిన అధికారులు అన్ని కోణాల్లో పరిశీలించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు