అమరావతి,27 జూన్
గుడివాడ: వైకాపా నేత, మాజీ మంత్రి కొడాలి నాని సుదీర్ఘ కాలం తర్వాత గుడివాడకు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టుకు హాజరయ్యారు. దిగువ కోర్టులో బెయిల్ తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో స్వయంగా వచ్చి దరఖాస్తు చేసుకున్నారు. హామీ పత్రాలు సమర్పించారు. ఇదే కేసులో 16 మంది నాని అనుచరులు ఇప్పటికే బెయిల్పై విడుదలయ్యారు. కొడాలి నాని చెబితేనే దాడి చేసినట్లు వారిలో పలువురు పోలీసు దర్యాప్తులో అంగీకరించారు. దాదాపు ఏడాది తర్వాత ఆయన తిరిగి గుడివాడకు రావడంతో పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ