హైదరాబాద్, 27 జూన్ (హి.స.) సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పై బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విషయంలో దళితుల పట్ల చూపిస్తున్న వివక్షఫై ఆర్ఎస్పీ మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోలంపల్లికి చెందిన నక్క సనా, వేణు దంపతులకు ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ ను ఆపేసిన ఘటనపై ఆర్ఎస్పీ తీవ్రంగా స్పందించారు.
అంటే మీ ఏఐ లాంగ్వేజ్ మోడల్లో వాట్సాప్ లో బీఆర్ఎస్ స్టేటస్ పెట్టుకుంటే, ఎస్సీలైతే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనవసరం లేదని షరతులు విధించి ప్రోగ్రాం తయారు చేసిండ్రన్న మాట! మరీ ఇంత చిల్లర పాలనా? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీతోపాటు కేసీఆర్ ఫొటో వాట్సాప్ స్టేటస్ పెట్టినందుకు బుధవారం మంత్రి వివేక్ నిర్వహించే కార్యక్రమంలో తనకు ఇవ్వాల్సిన ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్ను ఆపేసినట్టు మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోలంపల్లికి చెందిన నక్క సనా - వేణు దంపతులు ఆవేదన వ్యక్తంచేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్