హైదరాబాద్, 27 జూన్ (హి.స.)
ఈ నెల 28న అనగా రేపు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శేరిలింగంపల్లికి పర్యటన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో పాటు జోనల్, ప్రాజెక్ట్ ఇంజినీర్లతో కలిసి ఆయన శిల్ప లే ఔట్ ఫేస్-2 ఫ్లైఓవర్ పనులను శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ కర్ణన్ మాట్లాడుతూ.. రూ.182.72 కోట్ల అంచనా వ్యయంతో ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన 1.20 కిలోమీటర్ల పొడవుగల ఆరు లైన్ల బై డైరెక్షన్ ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి 28వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారని తెలిపారు. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ శిలాఫలకం ప్రదేశంతో పాటు పబ్లిక్ మీటింగ్ వేదికను కూడా ఆయన పరిశీలించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్