కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి: గద్వాల ఎమ్మెల్యే
తెలంగాణ, గద్వాల. 27 జూన్ (హి.స.) కేసుల సత్వర పరిష్కారానికి గద్వాలలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో
గద్వాల ఎమ్మెల్యే


తెలంగాణ, గద్వాల. 27 జూన్ (హి.స.)

కేసుల సత్వర పరిష్కారానికి గద్వాలలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గద్వాలకు చెందిన తేజేశ్వర్ హత్య బాధాకరమన్నారు. ఇదే తరహాలో గంగనపల్లిలో కూడా ఓ మహిళ హత్యకు గురయిందన్నారు. ఇలాంటి కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులే పరిష్కారమని చెప్పారు. నేరాలకు పాల్పడిన నిందితులను ఆరు నెలల్లోపు శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల నిందితులకు శిక్ష పడడంతో బాధితులకు న్యాయం జరిగినట్లు అవుతుందని పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande