.నెల్లూరు.జిల్లా.నాయుడుపేటలో సంఘం మిల్క్.ప్రొడ్యూసర్ కంపెనీ కి ప్రభుత్వం అనుమతి
అమరావతి, 27 జూన్ (హి.స.) అమరావతి: నెల్లూరు జిల్లా నాయుడుపేటలో పరిశ్రమ ఏర్పాటుకు సంగం మిల్క్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. నాయుడుపేటలోని MPSEZలో సంగం సంస్ధకు రాయితీపై భూముల కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎకరం రూ.50లక్షల చొప్పున 22
.నెల్లూరు.జిల్లా.నాయుడుపేటలో సంఘం మిల్క్.ప్రొడ్యూసర్ కంపెనీ కి ప్రభుత్వం అనుమతి


అమరావతి, 27 జూన్ (హి.స.)

అమరావతి: నెల్లూరు జిల్లా నాయుడుపేటలో పరిశ్రమ ఏర్పాటుకు సంగం మిల్క్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. నాయుడుపేటలోని MPSEZలో సంగం సంస్ధకు రాయితీపై భూముల కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎకరం రూ.50లక్షల చొప్పున 22.80 ఎకరాలు కేటాయించింది. సంగం సంస్థ రూ.112 కోట్లతో పాలు, పాలు ఆధారిత ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను సంగం నెలకొల్పనుంది. యూనిట్‌ ఏర్పాటు కోసం తదుపరి చర్యలు తీసుకోవాలని ఏపీఐఐసీ ఛైర్మన్‌, ఎండీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఈమేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ ఉత్తర్వులు ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande