అమరావతి, 27 జూన్ (హి.స.)
తిరుపతి: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాదు-కన్యాకుమారిమధ్య తిరువణ్ణామలై మీదుగా 8 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ) ఒక ప్రకటనలో తెలిపారు. తిరువణ్ణామలై పుణ్యక్షేత్రానికి పెరుగుతున్న రద్దీని తెలుసుకొని వీటిని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జూలై 2 నుంచి 25వ తేది వరకు రాకపోకలు సాగిస్తాయన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ