నేడు కేఆర్ఎంబీ సమావేశం.. స్పెషల్ ఇన్సెంటిప్స్పై కీలక నిర్ణయం
హైదరాబాద్, 27 జూన్ (హి.స.) హైదరాబాద్ జలసౌధలో చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB)20వ ప్రత్యేక సమావేశం శుక్రవారం జరిగింది .ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీ అధికారులు వర్చువల్ గా హాజరయ్యారు. ఈ భేటీలో కేఆర్ఎంబీలో ప్రస్తుతం పని చేస్
కేఆర్ఎంబీ


హైదరాబాద్, 27 జూన్ (హి.స.)

హైదరాబాద్ జలసౌధలో చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB)20వ ప్రత్యేక సమావేశం శుక్రవారం జరిగింది .ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీ అధికారులు వర్చువల్ గా హాజరయ్యారు. ఈ భేటీలో కేఆర్ఎంబీలో ప్రస్తుతం పని చేస్తున్న ఇంజనీర్లు, ఉద్యోగులకు గతంలో ఇచ్చిన ప్రత్యేక ఇన్సెంటివ్లకు సంబంధించిన అంశంపై ప్రధానంగా చర్చించారు. అదేవిధంగా కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలు, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలపై డిస్కస్ చేశారు. అనంతరం స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వరాదని.. ఉద్యోగుల నుంచి రికవరీ చేయకూడదని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande