అమరావతి, 27 జూన్ (హి.స.)
హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం ముగిసింది. బోర్డు ఛైర్మన్ అతుల్జైన్ అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో ఈ సమావేశం నిర్వహించారు. దిల్లీ నుంచి అతుల్ జైన్, తెలంగాణ, ఏపీ అధికారులు వర్చువల్గా హాజరయ్యారు. కృష్ణా బోర్డులో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక ఇన్సెంటివ్, కేంద్ర జలశక్తి శాఖ మార్గదర్శకాలు, హైకోర్టు ఆదేశాలపై చర్చించారు. ప్రత్యేక ఇన్సెంటివ్లు ఇవ్వరాదని, ఉద్యోగుల నుంచి రికవరీ చేయరాదని నిర్ణయించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ