నిరుపేదలకు అండగా సీఎంఆర్ఎఫ్.. చెక్కులు.. ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి
హైదరాబాద్, మెదక్. 27 జూన్ (హి.స.) నిరుపేదల వైద్యం ఖర్చులకు సీఎంఆర్ఎఫ్ పథకం ఆర్థికంగా అండగా నిలుస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. వెల్దుర్తి మండలంలోని మానేపల్లికి చెందిన శ్రీనివాల్రెడ్డి రూ.37,500, ఏదులపల్లికి చెందిన చిదంబర్
ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి


హైదరాబాద్, మెదక్. 27 జూన్ (హి.స.)

నిరుపేదల వైద్యం ఖర్చులకు సీఎంఆర్ఎఫ్ పథకం ఆర్థికంగా అండగా నిలుస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. వెల్దుర్తి మండలంలోని మానేపల్లికి చెందిన శ్రీనివాల్రెడ్డి రూ.37,500, ఏదులపల్లికి చెందిన చిదంబర్ రూ.60,000, వెల్దుర్తికి చెందిన మమత రూ.40,500, పెద్దాపూర్కు చెందిన మల్లేశ్ రూ.48,000, నెల్లూర్కు చెందిన అనిల్ రూ.5,000లకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు రాగా శుక్రవారం తన కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు భూపాల్రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల వైద్యానికి సీఎంఆర్ఎఫ్ పథకం భరోసా కల్పిస్తూ వారిని ఆదుకుంటుందని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande