హైదరాబాద్, 27 జూన్ (హి.స.)
బనకచర్ల ప్రాజెక్ట్పై బీఆర్ఎస్ నేతలు
తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ ఎంతో దెబ్బ తిన్నదని అన్నారు. తెలంగాణను సర్వనాశనం చేసి.. ఏం తెలియనట్లు హరీష్ రావు అబద్దాలు మాట్లాడుతున్నాడని సీరియస్ అయ్యారు. హరీష్ రావు పేరు మార్చుకొని.. గోబెల్స్ రావుగా నామకరణం చేసుకోవాలని హితవు పలికారు. గత పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం ప్రాజెక్టుల డిజైన్లు మార్చి.. అంచనాలు పెంచి.. వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..