అర్హత కలిగిన ఒక్కరికి కూడా డబుల్ బెడ్ రూమ్ అందించని గత ప్రభుత్వం : మంత్రి వాకిటి శ్రీహరి
తెలంగాణ, నారాయణపేట. 27 జూన్ (హి.స.) ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం బిల్లులు వస్తాయా,రావా అనే అనుమానం వద్దని, నా ఇల్లు అమ్మి అయిన మీకు బిల్లులు చెల్లిస్తానని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.శుక్రవారం వారు మక్తల్ లో ఇందిరా మహిళల లబ్ధిదారులకు సర్టిఫికెట్లు
మంత్రి శ్రీహరి


తెలంగాణ, నారాయణపేట. 27 జూన్ (హి.స.)

ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం బిల్లులు

వస్తాయా,రావా అనే అనుమానం వద్దని, నా ఇల్లు అమ్మి అయిన మీకు బిల్లులు చెల్లిస్తానని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.శుక్రవారం వారు మక్తల్ లో ఇందిరా మహిళల లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంజూరైన ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకోవాలని, ప్రస్తుతం మక్తల్ 300 ఇల్లులు మంజూరయ్యాయని,వాటిని పూర్తిచేసే మళ్లీ ఇంకా 300 ఇల్లులు మంజూరు చేయడానికి కలెక్టర్ తోసంభాషించానని అన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ బూచి చూపించి రెండుసార్లు అధికారం చేపట్టిందని,కానీ అర్హత కలిగిన ఒక్కరికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని, అందుకే ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపారని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande