అమరావతి, 27 జూన్ (హి.స.)
అమరావతి: అనంతపురం జిల్లాలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. గిన్ఫ్రా ప్రెసిషన్స్ సంస్థ తిమ్మసముద్రంలో పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. రూ.1,150 కోట్లతో బైమాడ్యులర్ ఛార్జ్ సిస్టమ్స్ తయారీ యూనిట్ నెలకొల్పనుంది. ఈ పరిశ్రమకు ఎకరం రూ.8.30లక్షల చొప్పున 121.53 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భూమి స్వాధీనం చేసుకున్న 14 నెలల్లో ఉత్పత్తి చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పరిశ్రమ ఏర్పాటుతో 299 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ