అమరావతి, 27 జూన్ (హి.స.)
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారికి నెల్లూరుకు చెందిన భక్తులు వెండి కవచాలను కానుకగా అందించారు. పర్ణశాలలోని స్వామివారి ఆలయంలో రూ.12 లక్షల విలువైన వెండి కవచాలను సమర్పించారు. సంతోష్ కుమార్ రెడ్డి, సాహిత్య దంపతులు 9 కేజీల వెండితో శ్రీ సీతారామ లక్ష్మణులకు కవచాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. శుక్రవారం ఉదయం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి వాటిని సమర్పించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ