అమరావతి, 27 జూన్ (హి.స.)
విశాఖ (ఉక్కునగరం): విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో మూడో బ్లాస్ట్ ఫర్నేస్ను పునఃప్రారంభించారు. ఉక్కు శాఖ జాయింట్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి దయా నిదాన్ పాండే, ఇంఛార్జి ఛైర్మన్ ఏకే సక్సెనా కలసి పునఃప్రారంభించారు. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ను ప్రారంభించడం వల్ల ప్రస్తుతం ఉన్న రెండింటితో కలిపి రోజుకు 21,000 టన్నుల హాట్ మెటల్ (పిగ్ ఐరన్) ఉత్పత్తి జరుగుతుందని అధికారులు తెలిపారు. మార్చి నుంచి మే వరకు ఆపరేషనల్ ప్రాఫిట్ రావడంతో ఇప్పటినుంచి విశాఖ ఉక్కుకు నికర లాభాలు వస్తాయని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ