నాగర్ కర్నూల్, 3 జూన్ (హి.స.)
ప్రతి గ్రామంలోని రైతుకు నాణ్యమైన విత్తనాలు అందజేయడం జరుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్త సుమలత అన్నారు. బుధవారం నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం గ్రామంలో గల రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూన్ 2వ తేదీన రాష్ట్రస్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. కాగా 3వ తేదీన మండల స్థాయిలో రైతు నేస్తం కార్యక్రమం జరిగే రైతు వేదికలో విత్తన పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రధానంగా వరి,జొన్న వంటి రకాలను పంపిణీ చేయడం జరిగింది అన్నారు. బిజినపల్లి మండలంలోని 9 క్లస్టర్లకు గాను 48 వరి, 24 జొన్న రకాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..