తెలంగాణ,కుమ్రం భీం ఆసిఫాబాద్: 3 జూన్ (హి.స.) ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ జోన్ ఏర్పాటును మానుకోవాలని, టైగర్ జోన్ ఏర్పాటు పేరుతో ఆదివాసీ గిరిజనులను ఇబ్బందులకు గురి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎమ్మెల్యే కోవలక్ష్మి హెచ్చరించారు. భూ సమస్యల పరిష్కారం కోసం స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రాజ్ గోండ్ సేవా సమితి. గోండ్వానా పంచాయతీ రాయి సెంటర్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలో ఎమ్మెల్యే పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆదివాసీ గిరిజనులతోనే అడవుల మనుగడ సాధ్యమని, అటవీ హక్కు పట్టాలు ఉన్న.. పోడు సాగు పేరుతో వారిని అటవీ అధికారులు ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు