హైదరాబాద్. 3 జూన్ (హి.స.)
నేటితో తమ శాఖలకు చెందిన
విభాగాలను హెల్త్ డిపార్టుమెంటు కు అప్పజెప్పినట్లు సీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన గోషామహల్ పోలీస్ గ్రౌండ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తున్న నేపథ్యంలో హార్స్ షెడ్డు ను తాత్కాలికంగా తరలించినట్లు తెలిపారు. ప్రభుత్వం 55 కోట్ల రూపాయలతో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం నిర్మించాలని నిర్ణయించిందన్నారు. ఆసుపత్రి నిర్మాణం పనులు త్వరలో జరుగనున్న నేపథ్యంలో తమ పోలీస్ శాఖకు చెందిన అన్ని బ్లాక్స్ ను తరలిస్తున్నామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..