తెలంగాణ, ఖమ్మం. 3 జూన్ (హి.స.)
అత్యంత పారదర్శకమైన భూభారతి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రైతులకు ఎంతో ఉపయోగపడే చట్టాన్ని జాగ్రత్తగా రూపకల్పన చేశామని ఈ కొత్త చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సదస్సులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలం ములుగుమాడు గ్రామంలో రెవెన్యూ సదస్సు ప్రారంభోత్సవంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం.. గతంలో భూమికి రకం కట్టడం వల్ల రైతులకు భూమి ఎంతో ఉందో తెలిసేది, ఏటా రకం కట్టడం వల్ల రికార్డుల్లో భూమి మారితే వెంటనే రైతులకు తెలిసేదన్నారు. కానీ గత ప్రభుత్వం నిర్వాకం వల్ల రైతులకు వివరాలు తెలియకుండా పోయిందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు