అమరావతి, 3 జూన్ (హి.స.)
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ) దాడి కేసును ఎదుర్కుంటున్న బాధితులను రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు () పరామర్శించారు. ఈరోజు (మంగళవారం) గులకారయి కేసులో నిందితులు సతీష్ ఇంటికి ఏబీ వెళ్లారు. సతీష్ తల్లిదండ్రులు, పిల్లలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. మనుషుల్ని వాళ్ళ జీవితాల్ని, శవాలను తొక్కుకుంటూ రాజకీయాలు చేసే వ్యక్తి జగన్ అంటూ మండిపడ్డారు. లేనిపోని దాన్ని తీసుకుని మభ్యపెట్టి రాజకీయం చేశారని విమర్శించారు. ఒక్క వడ్డెర కులస్తుడు జీవితాన్ని, అతని కుటుంబాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ