జవాన్ భూమిని.కబ్జా చేసిన. వైకాపా.నాయకుడు
అమరావతి, 3 జూన్ (హి.స.) మడకశిర, అమరాపురం, వైకాపా ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడి హోదాను అడ్డు పెట్టుకుని తమ బంధువు (మామ) భూమిని కబ్జా చేశాడని జవాన్‌ తీసిన సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. అమరాపురం మండలం ఉదుగూరుకు చెందిన నరసింహమూర్తి
జవాన్ భూమిని.కబ్జా చేసిన. వైకాపా.నాయకుడు


అమరావతి, 3 జూన్ (హి.స.)

మడకశిర, అమరాపురం, వైకాపా ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడి హోదాను అడ్డు పెట్టుకుని తమ బంధువు (మామ) భూమిని కబ్జా చేశాడని జవాన్‌ తీసిన సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. అమరాపురం మండలం ఉదుగూరుకు చెందిన నరసింహమూర్తి బీఎస్‌ఎఫ్‌ జవాన్‌గా పని చేస్తున్నారు. అదే మండలం కె.శివరం గ్రామానికి చెందిన కదురప్ప నాల్గొ కుమార్తె సింధూను జవాన్‌ వివాహం చేసుకున్నాడు. ఆయన మామ స్థానికంగా ఉపాధి లేకపోవడంతో కర్ణాటకలోని భద్రావతి వద్ద కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో కదురప్ప పేరిట 366-6, 7, 8, 9 సర్వే నంబర్లలో 2.02 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం పక్కనే ఉపాధి హామీ మాజీ క్షేత్ర సహాయకుడు నాగరాజు పొలం ఉంది. గతంలో వైకాపా అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆ భూమిని దౌర్జన్యంగా సాగు చేస్తున్నాడు. ఐదేళ్లుగా జవాన్‌ మామ న్యాయం కోసం కోర్టుకు వెళ్లగా తీర్పు సానుకూలంగా వచ్చింది. దీంతో పొలాన్ని సాగు చేయాలని కదురప్ప వెళ్లగా నాగరాజు దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ జవాన్‌ తన సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్‌ సరిహద్దులో కాపాలా కాస్తూ ఉంటే మా బంధువులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో స్పందించిన తహసీల్దార్‌ లక్ష్మీనరసింహ, ఎస్‌ఐ ఇసాక్‌బాషా సోమవారం ఆర్‌ఐ, సర్వేయర్‌తో కలిసి పొలం వద్దకు వెళ్లి సరిహద్దు రాళ్లు పరిశీలించారు. రికార్డు పరంగా జవాన్‌ మామ కదురప్ప పేరిట 1బీ, అడంగల్‌ మొత్తం ఉన్నాయని, అతనికే పొలం చెల్లుందని చెప్పారు. మంగళవారం బాధిత రైతుకు పొలాన్ని అప్పగించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని తహసీల్దార్‌ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande