రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్లను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మేడ్చల్ మల్కాజిగిరి, 3 జూన్ (హి.స.) మహిళల్లో రొమ్ము క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోఇండియన్ ఆయిల్ సంస్థ (సీఆర్ఎస్) కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ సర్వీసెస్ న
ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి


మేడ్చల్ మల్కాజిగిరి, 3 జూన్ (హి.స.)

మహిళల్లో రొమ్ము క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోఇండియన్ ఆయిల్ సంస్థ (సీఆర్ఎస్) కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ సర్వీసెస్ నిధులు ద్వారా మహిత స్వచ్ఛంద సంస్థ సహకారంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా రేడియేషన్ లేకుండా రొమ్ము క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ను గుర్తించే అత్యాధునిక స్క్రీనింగ్ ఇనిషియేటివ్ మిషన్, తెలంగాణ డయాగ్నస్టిక్స్ మినీ హబ్ ను ఎంపీ ఈటల రాజేందర్ తో కలిసి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. మహిళల్లో తరచూ వచ్చే రొమ్ము క్యాన్సర్తోపాటు సర్వైకల్ క్యాన్సర్ను ప్రాథమిక దశలో పరీక్షలు నిర్వహించి గుర్తించవచ్చని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande