తెలంగాణ ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రం గా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.. మంత్రి కొండా సురేఖ పిలుపు
హైదరాబాద్, 3 జూన్ (హి.స.) తెలంగాణ రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత స్టేట్ గా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. తెలంగాణలో ఎవరూ ప్లాస్టిక్ వాడొద్దని.. పర్యావరణాన్ని నష్టపరచొద్దని మంత్రి చెప్పారు. తెలంగాణ కాలు
మంత్రి కొండా సురేఖ


హైదరాబాద్, 3 జూన్ (హి.స.)

తెలంగాణ రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత

స్టేట్ గా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. తెలంగాణలో ఎవరూ ప్లాస్టిక్ వాడొద్దని.. పర్యావరణాన్ని నష్టపరచొద్దని మంత్రి చెప్పారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) పోస్టరును మంగళవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2025 సందర్భంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం అనే థీమ్తో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. పర్యావరణం, వన్యప్రాణులు, మానవ ఆరోగ్యంపై ప్లాస్టిక్ కాలుష్యం వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

స్థిరమైన పద్ధతులను అవలంభించడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, రీసైక్లింగ్ చేయడం, సరైన వ్యర్థాల నిర్వహణ అవసరాన్ని మంత్రి నొక్కి చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో సమాజ భాగస్వామ్యాన్ని, వ్యక్తులు పాల్గొనేలా ప్రోత్సహించి ప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande