తెలంగాణ, ఖమ్మం. 3 జూన్ (హి.స.)
మనుషులకు ఆధార్ నంబర్ లాగ భూములకు భూధార్ నంబర్ ఏకైక గుర్తింపు అని రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా ఎరుపాలెం లో జరిగిన భూభారతి సదస్సులో పాల్గొని ప్రసంగించారు. రైతుల భూ సమస్యలను గ్రామాల్లోనే పరిష్కరించేందుకు భూభారతి చట్టం-2025ను అమలు చేస్తున్నామన్నారు. ఈ భూధార్ నంబర్ ద్వారా భూమి యజమాని, సర్వే నంబర్, విస్తీర్ణం, స్వభావం వంటి వివరాలను సులభంగా, పారదర్శకంగా తెలుసుకోవచ్చని తెలిపారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూ రికార్డులు తారుమారుగత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూ రికార్డులను తారుమారు చేసి, రైతులకు ఇబ్బందులు కలిగించారని మంత్రి పొంగులేటి ఆరోపించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు