తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 3 జూన్ (హి.స.)
రాష్ట్రంలో పామాయిల్ సాగుకు పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఆయిల్ పామ్ పంటకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు అనుకూల వాతావరణం ఉందని, ఇది రైతులకు స్థిర ఆదాయం కలిగించే లాంగ్ టర్మ్ పంట అని పేర్కొన్నారు.
మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలోని ఆయన నివాసంలో వ్యవసాయ అధికారులతో పామాయిల్ సాగుపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆయిల్ పామ్ పంటను మరింత విస్తృతంగా సాగు చేయించాలని, ప్రతి రైతుకు పామాయిల్ మొక్కలు అందించేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు