అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి..
తెలంగాణ, తొర్రూరు. జూన్ (హి.స.) అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చెప్పారు. మంగళవారం పట్టణంలోని విశ్రాంతిభవనం ప్రాంగణంలో ఇందిరమ్మ ఇళ్ల‌ మంజూరు పత్రాలను గ్రామాల వారీగా అర్హులైన వారికి అందజేశారు.అనంత
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి


తెలంగాణ, తొర్రూరు. జూన్ (హి.స.)

అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చెప్పారు. మంగళవారం పట్టణంలోని విశ్రాంతిభవనం ప్రాంగణంలో ఇందిరమ్మ ఇళ్ల‌ మంజూరు పత్రాలను గ్రామాల వారీగా అర్హులైన వారికి అందజేశారు.అనంతరం మాట్లాడుతూ… గత ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో పట్టించుకోలేదన్నారు. మ‌న ప్ర‌భుత్వం పేదవారికి సంక్షేమ పథకాలు అందజేస్తుందని, పాలకుర్తి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరైనాయని, వారి గృహ నిర్మాణం చేపట్టినప్పుడు దశల వారీగా డబ్బులు అందజేయడం జరుగుతుందన్నారు. ఇది నిరంత‌ర ప్ర‌క్ర‌య అని, అర్హులైన పేద‌వారి పేర్లు ప్ర‌స్తుత‌ జాబితాలో లేక‌పోతే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande