అమరావతి, 3 జూన్ (హి.స.)
తుని కేసుకు( సంబంధించి ఏపీ ప్రభుత్వం)కీలక నిర్ణయం తీసుకుంది. తుని కేసు తిరగదోడే ఉద్దేశం లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. తుని కేసు కొట్టేస్తూ రైల్వే కోర్టు ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్లే యోచన లేదని సర్కార్ స్పష్టం చేసింది. తుని కేసును హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏ స్థాయిలో ఆమోదంతో ఫైల్ నడిచిందనే విషయంపై సర్కార్ ఆరా తీసింది. కేసుపై ఆర్పీజీ సీనియర్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఉత్తర్వులు వెలువడినట్టు గుర్తించింది. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని ప్రభుత్వం నుంచి అధికారులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. జీవోను రద్దు చేస్తూ కాసేపట్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ