అమరావతి, 3 జూన్ (హి.స.)
, ఏలూరు: యోగాంధ్ర-2025లో భాగంగా ఏప్రిల్ 21 నుంచి జూన్ 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున మాస్టర్ ట్రైనర్లతో యోగాలో శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఏలూరుకు చెందిన ఆలీఖాన్ మహమ్మద్ పదేళ్ల కిందట సేకరించిన రూ.100 వెండి నాణేన్ని ప్రదర్శించారు. యోగాకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2015 జూన్ 21న ఈ స్మారక నాణేన్ని విడుదల చేసింది. 35 గ్రాముల బరువున్న ఈ నాణేన్ని రూ.3500 పెట్టి సేకరించారు ఆలీఖాన్. నాడు విడుదలైన రూ.5 యోగా తపాలా స్టాంపు(మినియేచర్) సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ