శ్రీశైలం, 3 జూన్ (హి.స.)సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) సైంటిస్టుల బృందం సభ్యులు మంగళవారం ఉదయం శ్రీశైలం డ్యామ్ (Srisailam Dam) వద్దకు చేరుకున్నారు. డ్యామ్ ఫ్లంజ్ పూల్పై మూడు రోజుల పాటు సర్వే చేయనున్నారు. గత నెల 20న వారు డ్యామ్ భద్రతకు సంబంధించి పలు అంశాలపై అధ్యయనం చేసిన విషయం తెలిసిందే. మరోసారి పూర్తిస్థాయిలో అధ్యయనం చేయనున్నారు. కాగా శ్రీశైలం జలాశయంలో దిగువన ఉన్న ప్లంజ్ పూల్ కాంక్రీట్ స్టీల్ సిలిండర్ డ్రమ్స్ భారీ వరద కారణంగా దెబ్బ తిన్నాయి. దీంతో భారీ గుంత ఏర్పడటంతో.. డ్యామ్ సేఫ్టీ పై కొద్ది రోజులుగా ఆందోళనలు మొదలయ్యాయి.
ఈ సమాచారం అందుకున్న సీడీవో బృందం మే 20న శ్రీశైలం (Srisailam) చేరుకుంది. డ్యామ్ దిగువన దెబ్బతిన్న ప్లంజ్ పూల్ కాంక్రీట్ స్టీల్ సిలిండర్ డ్రమ్స్ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ప్లంజ్ పూల్ గుంతను సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సీఈ విజయభాస్కర్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఇదిలా ఉంటే కృష్ణానది ఎగువన ఉన్న రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గత వారం రోజులుగా శ్రీశైలం జలాశయానికి స్వల్ప వరద వచ్చి చేరుతున్న విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి