ఉత్తరాఖండ్, 30 జూన్ (హి.స.)ఉత్తరాఖండ్ లో
భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్ర ను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా పరిస్థితులు మెరుగుపడటంతో నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. గర్హ్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ఈ మేరకు ప్రకటించారు. 'చార్ధామ్ యాత్రపై 24 గంటల నిషేధాన్ని ఎత్తివేశాం' అని ప్రకటించారు. వాతావరణ పరిస్థితులను బట్టి ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే వాహనాలను నిలిపివేయాలని సూచించారు. కాగా, ఉత్తరాఖండ్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ హెచ్చరికలతో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..