అమ్మకాల ఒత్తిడి.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!
ముంబై, 30 జూన్ (హి.స.) దేశీయ స్టాక్ మార్కెట్లో సోమవారం నష్టాల్లో ముగిశాయి. మెటల్, ఆటో, రియాల్టీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో బలమైన అమ్మకాలతో మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. అయితే, పీఎస్యూ బ్యాంక్, ఐటీ, మీడియా రంగ్లాలో కొనుగోళ్లతో నిఫ్టీ 25,500 ఎగువన ముగిసింద
స్టాక్ మార్కెట్


ముంబై, 30 జూన్ (హి.స.)

దేశీయ స్టాక్ మార్కెట్లో సోమవారం

నష్టాల్లో ముగిశాయి. మెటల్, ఆటో, రియాల్టీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో బలమైన అమ్మకాలతో మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. అయితే, పీఎస్యూ బ్యాంక్, ఐటీ, మీడియా రంగ్లాలో కొనుగోళ్లతో నిఫ్టీ 25,500 ఎగువన ముగిసింది. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 84,027.33 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 84,099.53 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్.. అత్యల్పంగా 83,482.13 పాయింట్లకు పడిపోయింది. చివరకు 452.44 పాయింట్లు తగ్గి 83,606.46 వద్ద ముగిసింది. నిఫ్టీ 120.75 పాయింట్లు తగ్గి 25,517.05 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.6శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.8శాతం పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ కూడా రికార్డు స్థాయిలో 57,614.50 పాయింట్లకు పెరిగింది. ఆ తర్వాత 0.2శాతం తగ్గి 57,312.75 వద్ద ముగిసింది. నిఫ్టీలో టాటా కన్స్యూమర్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హీరో మోటోకార్ప్, మారుతి సుజుకి ప్రధానంగా నష్టాలను చవిచూశాయి.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande