ముంబయి 30 జూన్ (హి.స.): 1 నుంచి 5 తరగతుల వరకు హిందీ భాషను తప్పనిసరిగా ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తంకావడంతో త్రిభాషా విధానం అమలుపై ఇచ్చిన రెండు జీఆర్ల (ప్రభుత్వ ఉత్తర్వులు)ను మహారాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. భాషా విధానం ముందుకు సాగడానికి విద్యావేత్త నరేంద్ర జాదవ్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు. తాజా పరిణామం నేపథ్యంలో.. త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా జులై 5న నిర్వహించతలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని మహారాష్ట్ర నవనిర్మాణ సేన, శివసేన (యూబీటీ)లు రద్దు చేసుకున్నాయి. అయితే మరాఠీల ఐక్యత కోసం ఆ రోజున ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే స్పష్టంచేశారు. మరాఠీల మధ్య చీలిక తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం విఫలయత్నం చేసిందని ఆరోపించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు