ఐదేళ్ల అరాచక పాలన ముగిసి ఏడాది.. ఉప ముఖ్యమంత్రి పవన్​కల్యాణ్
అమరావతి, 4 జూన్ (హి.స.)కూటమికి విజయం దక్కిన రోజును ఉప ముఖ్యమత్రి పవన్​కల్యాణ్​గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏడాది గడిచిందని ఆయన ఎక్స్​లో పోస్టు చేశారు. ఎన్టీఏ (NDA) కూటమి చారిత్రక విజయానికి ఏడాది... జనసేన పార్టీ వందశాతం స్ట్రైక్ రేట్ వ
ఐదేళ్ల అరాచక పాలన ముగిసి ఏడాది.. ఉప ముఖ్యమంత్రి పవన్​కల్యాణ్


అమరావతి, 4 జూన్ (హి.స.)కూటమికి విజయం దక్కిన రోజును ఉప ముఖ్యమత్రి పవన్​కల్యాణ్​గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏడాది గడిచిందని ఆయన ఎక్స్​లో పోస్టు చేశారు. ఎన్టీఏ (NDA) కూటమి చారిత్రక విజయానికి ఏడాది... జనసేన పార్టీ వందశాతం స్ట్రైక్ రేట్ విజయానికి ఏడాది... అని ఆయన పేర్కొన్నారు. ‘ఇది భారతదేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే రోజు, ఐదేళ్ల అరాచక పాలనను తరిమికొట్టి, నిరంకుశ ఫ్యూడలిస్టిక్ కోతలను ప్రజలు తమ ఓటు హక్కుతో బ ద్దలుకొట్టి, ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికిన రోజు.. నరేంద్రమోదీ దృఢమైన నాయకత్వం, నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం, ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో దృఢంగా నిలచిన చంద్రబాబు (Chandrababu) నేతృత్వంలో, దశాబ్ద కాలంగా ఎన్నో పోరాటాలు చేసి, మరెన్నో దాష్టికాలను తట్టుకుని అడ్డుగోడగా నిలచిన జనసైనికులు, వీరమహిళల పోరాట స్పూర్తి, వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే జనసేన సంకల్పానికి ప్రజలు అండగా నిలిచి చారిత్రాత్మక విజయాన్ని అందించిన రోజు..’ అని ఆయన పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande