అమరావతి, 4 జూన్ (హి.స.)ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది అయిన సందర్భంగా నాటి ప్రజా తీర్పుపై 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. నాటి ప్రజాతీర్పుతో ఉన్మాద పాలన కొట్టుకుపోయిందన్నారు. వచ్చే నాలుగేళ్లలో కూటమి ప్రభుత్వంలో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. నాటి గెలుపుపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి పార్టీల కార్యకర్తలు, నేతలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
జూన్ 4....ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు... ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు... అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు... సైకో పాలనకు అంతం పలికి... ప్రతి పౌరుడూ స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు... ఉద్యమంలా ఓట్లేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజు... ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజు... పసుపు సైనికుల పోరాటాలు, జనసైనికుల ఉద్యమాలు, కమలనాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజు....
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి