అమరావతి, 4 జూన్ (హి.స.)పీడ విరగడై ఏడాది గడిచిందని మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) అన్నారు.
కూటమి ప్రభుత్వం పాలన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. అలాగే వైసీపీ చేపట్టిని కార్యక్రమానికి వ్యతిరేకంగా విజయవాడ(Vijawada)లో ఆందోళనకు కూటమి నేతల పిలుపునిచ్చారు. ఎంపీ కేశినేని చిన్ని, MLA గద్దె రామ్మోహన్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల .. గత జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎన్ని సమస్యలు వచ్చినా ప్రజలు కూటమి వెంటే ఉన్నారన్నారు. అభివృద్దే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని నాదెండ్ల పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి